• PLEASE NOTE:
  • To get daily free STOCK tips on your mobile, please type ON give space, then again type TELUGUSTOCKMARKET and sms to 9870807070. This service is free of cost and is available through out INDIA ..

తెలుగు వారికి శుభ వార్త !

ఇప్పుడు స్టాక్ మార్కెట్ టిప్స్ మీ మొబైల్ లో ఉచితం గా లభ్యం ! TELUGU STOCKMARKET . COM నుండి మన తెలుగు వారికి అపూర్వ కానుక. ప్రతీ రోజు సలహా పేజి లో సూచిస్తున్న TIPS మీకు మీ CELL PHONE లో లభిస్తాయి! రిజిస్టర్ చేసుకునేందుకు మీరు మీ మొబైల్ లో ON అని టైపు చేసి, స్పేస్ ఇవ్వండి.తరువాత TELUGUSTOCKMARKET అని టైపు చేసి 9870807070 నకు SMS పంపించండి.! ఇక ప్రతీ ఉదయం మీ ఫోన్ నుండి కూడా మా సేవలు మీరు అందుకోవచ్చు.. పూర్తి గా ఉచితం గా !

  • 15-12-2009
  • మార్కెట్ రిపోర్ట్

డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో అడ్వాన్స్ టాక్స్ వృద్ధి చెందినప్పటికీ బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలతో ముగిసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికానికి చెల్లించాల్సిన అడ్వాన్స్ ట్యాక్స్‌గా రూ. 8.5 బిలియన్ల(396 మిలియన్ డాలర్లు లేక రూ. 850 కోట్లు)ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చెల్లించింది. ఇలా పలు సంస్థలు చెల్లించిన పన్నుతో అడ్వాన్స్ టాక్స్ గణాంకాలు ఆశాజనకంగా నమోదయినప్పటికీ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ మంగళవారం నష్టాలతో ముగిసింది. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్.. 220 పాయింట్లు క్షీణించి, 16,877 పాయింట్ల వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 72 పాయింట్లు పతనమై, 5, 033 పాయింట్ల వద్ద ముగిసింది.

విదేశీ మార్కెట్ల ప్రభావంతో ట్రేడింగ్ ప్రారంభంలో పురోగమనం వైపు పయనించిన బాంబే స్టాక్ మార్కెట్ గరిష్టం గా 17200 పాయింట్లకు చేరుకుంది. ఇది మేము ఉదయం సూచించిన 17198 పాయింట్ల అవరోదానికి అత్యంత సమీపం గా ఉండటం విశేషం. ఐతే అమ్మకాల ఒత్తిడి.. మదుపుదారులు అమ్మకాల వైపు మొగ్గుచూపడం వంటి కారణాలతో సెన్సెక్స్ పతనమైంది .పైగా కే . జి బేసిన్ లో 6 చమురు బావుల లో నిక్షేపాలు దొరకనందున , ప్రభుత్వానికి తిరిగి ఇచ్చివేయనున్నట్లు చేసిన ప్రకటన కూడా రిలయన్స్ వాటాలు , తద్వారా సెన్సెక్స్ నష్ట పోయేందుకు కారణ మయ్యింది.

నేటి ట్రేడింగ్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.56 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.42 శాతం కోల్పోయింది.

సేక్టరాల్ ఇండెక్స్ ల లో నేడు హెల్త్ కేర్ మినహా అన్ని ఇండెక్స్ లు నష్టాల లో కూరుకుపోయాయి. ఈ ఇండెక్స్ 0.11 % స్వల్ప లాభాన్ని ఆర్జించగా , బ్యాంకింగ్ రంగం అత్యధికం గా 2.95 % నష్టపోయింది. కాగా ఆటో ఇండెక్స్ కూడా 1.93 % కోల్పోయింది .

సెన్సెక్స్ స్టాకు ల లో RCOM, HDFC గరిష్టం గా 3.7 %, 3.3 % చొప్పున నష్టపోయాయి. కాగా ITC 1.3 % , HINDALCO 1.1% స్వల్పంగా లాభపడ్డాయి.

నేడు ట్రేడింగ్ అనంతరం BSE విడుదల చేసిన ప్రకటన ప్రకారం డిసెంబర్ 18 నుండి ట్రేడింగ్ సమయం ఉదయం 9.55 గంటల బదులుగా 9.45 గంటలకు ప్రారంభం కానున్నది.

  • 15-12-2009
  • మార్కెట్ నాడి

జపాన్ లో విడుదల ఐన చిన్న తరహ సంస్థలకి చెందిన గణాంకాల లో క్షీణత నమోదు కావటం తో నేడు అక్కడి మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. కాగా ఇతర ఆసియా మార్కెట్లు , నేడు రాత్రి అమెరికా లో చోటు చేసుకోనున్న రెండు రోజుల ఫెడ్ రిజర్వు కీలక సమావేశాల నేపధ్యం లో , అప్రమత్త ధోరణి లో ట్రేడ్ అవుతున్నాయి.

మన మార్కెట్ల పరం గా యోచిస్తే , మిరే అసెట్ సంస్థ , భారత దేశం లో పెరుగుతున్న ద్రవ్యోల్బణ కారణం గా వచ్చే త్రై మాసికం లో స్టాక్ మార్కెట్ లాభాలకి గండి పడవచ్చని జోస్యం చెప్పటం వలన , నేడు మన మార్కెట్ల లో కొంత బలహీనత కనపడే అవకాశం ఉంది. టెక్నికల్ గా గూడా మార్కెట్లు గత కొన్ని రోజులు గా దిశా హీనం గా ట్రేడ్ అవుతున్నాయి. 17350- 17493 పాయింట్ల మధ్య అవరోధాన్ని సెన్సెక్స్ చేదించలేక పోతున్నందున , మార్కెట్లు పెరిగినా , ఈ స్థాయి లో మరల అమ్మకాల వత్తిడి కి గురి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి , నిర్దిష్ట దిశ మార్కెట్లు ఎన్నుకునే దాక , స్టాకులు వారిగా ట్రేడ్ చేయటం ఉత్తమం.

  • నేడు సెన్సెక్స్ నకు కీలక మజిలీలు :
  • గత ముగింపు: 17097
  • అవరోధాలు: 17125-17198-17240-17373
  • మద్దత్తులు:17002-16978-16810